మంగళగిరి హైవేపై డివైడర్ ధ్వంసం... సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్
ABN, First Publish Date - 2021-12-22T18:05:53+05:30
మంగళగిరి హైవేపై డివైడర్ ధ్వంసం చేయడాన్ని సవాల్ చేస్తూ పోతినేని శ్రీనివాసరావు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
అమరావతి: మంగళగిరి హైవేపై డివైడర్ ధ్వంసం చేయడాన్ని సవాల్ చేస్తూ పోతినేని శ్రీనివాసరావు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రోడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా డివైడర్ తొలగించారని పిటిషన్ వేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒత్తిడి మేరకు డివైడర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. డివైడర్ ధ్వంసం చేసే ముందు టెండర్లు పిలువలేదని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఇంద్రనీల్ వాదనలు వినిపించనున్నారు.
Updated Date - 2021-12-22T18:05:53+05:30 IST