పుట్టినరోజు వేడుకలకు ఏపీ గవర్నర్ దూరం
ABN, First Publish Date - 2021-08-01T21:29:55+05:30
ఈ సారి కూడా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూదడని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: ఈ సారి కూడా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూదడని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీ ఏపీ గవర్నర్ పుట్టినరోజు... అయితే కరోనా పరిస్థితుల కారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ రాజ్భవన్కు రావద్దని విజ్ఞప్తి చేశారు. అర్హులైన వారందరూ కరోనా టీకా వేయించుకోవాలని బిశ్వభూషణ్ కోరారు. ప్రతి ఒక్కరు కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది కూడా గవర్నర్ పుట్టినరోజు వేడుకులు జరుపుకోలేదు.
Updated Date - 2021-08-01T21:29:55+05:30 IST