ఏపీ ప్రభుత్వం సామాజిక భద్రతకు తూట్లు పొడుస్తోంది: నక్కా ఆనందబాబు
ABN, First Publish Date - 2021-09-03T23:13:03+05:30
ఏపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండపడ్డారు. ఏపీ ప్రభుత్వం సామాజిక భ్రదతకు తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండపడ్డారు. ఏపీ ప్రభుత్వం సామాజిక భద్రతకు తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పెన్షన్లు పెంచాల్సిందిపోయి తగ్గించడం అన్యాయమని తప్పుబట్టారు. టీడీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూశామని, కుంటిసాకులు చెప్పి పెన్షన్లలో కోత విధించడం తగదని నక్కా ఆనందబాబు అన్నారు.
Updated Date - 2021-09-03T23:13:03+05:30 IST