ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అరాచకాలకు హద్దు లేకుండా పోయింది: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-11-09T23:05:53+05:30

వైసీపీ అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కుప్పం స్థానిక ఎన్నికల్లో వైసీపీ నేతల అక్రమాలపై ఆయన ప్రెస్ మీట్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కుప్పంలో కొందరు పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. నామినేషన్లు వేయకుండా దారికాచి అడ్డుకున్నారని, ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. కుప్పంలో వైసీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారన్నారు. కుప్పం 14వ వార్డులో బెస్త కులానికి చెందిన వెంకటేష్‌ నామినేషన్‌ వేశారని, అయితే ఆయనను బుల్లెట్‌ బైక్‌పై వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని సూచించారు. తమపైనే దాడులు చేస్తూ.. తిరిగి కేసులు పెడుతున్నారన్నారు. వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు విమర్శించారు. 

Updated Date - 2021-11-09T23:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising