ఏపీలో కొత్తగా 2,620 కరోనా కేసులు నమోదు
ABN, First Publish Date - 2021-06-21T22:36:32+05:30
ఏపీలో కొత్తగా 2,620 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,620 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ తో 44 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18,53,183కి చేరగా, కరోనాతో 12,363 మంది మరణించారు. అలాగే 58,140 యాక్టివ్ కేసులు ఉండగా, 17,82,680 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో 55,002 కరోనా టెస్టుల నిర్వహించారు. రాష్ట్రంలో 24 గంటల్లో 7,504 మంది రికవరీ అయ్యారు. చిత్తూరు జిల్లాలో 10 మంది, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అలాగే కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.
Updated Date - 2021-06-21T22:36:32+05:30 IST