ఏపీలో 3,495 కరోనా కేసులు నమోదు
ABN, First Publish Date - 2021-04-12T00:23:01+05:30
ఏపీలో 3,495 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 3,495 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కేసులు 9,25,401కి చేరగా, వైరస్తో 7,300 మంది మరణించారు. రాష్ట్రంలో 20,954 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,97,147 మంది రికవరీ అయ్యారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. అలాగే గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.
Updated Date - 2021-04-12T00:23:01+05:30 IST