30 వరకు ఇళ్ల పట్టాల పంపిణీ: సీఎం జగన్
ABN, First Publish Date - 2021-01-21T01:58:50+05:30
జనవరం 30 వరకు ఇళ్ల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ
అమరావతి: జనవరం 30 వరకు ఇళ్ల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ అన్నారు. సమగ్ర భూ సర్వేపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లబ్ధిదారులకు సంతృప్తి కలిగించేలా ఇళ్ల పట్టాల కార్యక్రమం కొనసాగాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అలాగే అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో పట్టా ఇవ్వాలని సూచించారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. లబ్ధిదారుడికి పట్టా అందించి ఇంటి స్థలాన్ని చూపిస్తామని సీఎంకు అధికారులు తెలియజేశారు.
Updated Date - 2021-01-21T01:58:50+05:30 IST