అమరావతి పాదయాత్రకు బ్రహ్మరథం
ABN, First Publish Date - 2021-11-04T21:08:10+05:30
అమరావతి మహా పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ‘అమరావతి’ రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నాలుగవ
అమరావతి: అమరావతి మహా పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ‘అమరావతి’ రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. న్యాయస్దానం నుంచి దేవస్దానం పేరుతో మహా పాదయాత్ర చేపట్టారు. మొక్కవోని దీక్షతో పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది. అమరావతి రైతు దండుకు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, యువత తోడయ్యారు. జననీరాజనంతో సాగిన యాత్రకు వివిధ వర్గాల నుంచి విశేష స్పందన వస్తోంది. అమరావతితోనే 13 జిల్లాల అభివృద్ధికి పునాది.. జై అమరావతి అంటూ నినదిస్తూ మహిళలు, రైతులు కదం తొక్కారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాల్గవ రోజు పాదయాత్ర సాగనుంది. మూడు రోజులలో 43 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగింది. పాదయాత్రలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి.
Updated Date - 2021-11-04T21:08:10+05:30 IST