AP: అసెంబ్లీలో ఆరోగ్యశ్రీపై ఆసక్తికర చర్చ
ABN, First Publish Date - 2021-11-23T16:38:01+05:30
ఏపీ అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తర సమయంలో ఆరోగ్యశ్రీపై ఆసక్తికర చర్చ జరిగింది.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆరోగ్యశ్రీపై ఆసక్తికర చర్చ జరిగింది. కందుకూరులో ఆరోగ్యశ్రీ పథకాన్ని డాక్టర్లు లేకుండానే క్లైమ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మహిధర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని మాట్లాడుతూ అలా అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - 2021-11-23T16:38:01+05:30 IST