ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ABN, First Publish Date - 2021-11-18T16:19:14+05:30
ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈమేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు కాకుండా పొడిగించాలని బీఏసీ సమావేశంలో టీడీపీ కోరగా.. అందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో ఆరు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గురువారం ఉదయం స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం జగన్, మంత్రులు బుగ్గన, అనిల్, కన్నబాబు హాజరయ్యారు.
Updated Date - 2021-11-18T16:19:14+05:30 IST