టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మరో కేసు నమోదు
ABN, First Publish Date - 2021-05-12T00:16:42+05:30
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై గుంటూరులో మరో కేసు నమోదైంది. న్యాయవాది
గుంటూరు : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై గుంటూరులో మరో కేసు నమోదైంది. న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ ఫిర్యాదుతో అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను భయపెట్టేలా మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని పచ్చల అనిల్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవాది అనిల్ ఫిర్యాదు చేయడంతో 188, 505(1)బి, 505(2) సెక్షన్ల కింద పోలీసులు చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు.
కర్నూలులో కేసు నమోదు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదైంది. కరోనా విషయంలో ప్రజల భయాందోళనకు గురి చేశారంటూ కర్నూలుకు చెందిన సుబ్బయ్య అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు భయపెట్టారని సుబ్బయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబుపై ఐపీసీ 155,505/1/బి/2, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - 2021-05-12T00:16:42+05:30 IST