71 డిమాండ్లకు స్పందన లేదు: బొప్పరాజు
ABN, First Publish Date - 2021-12-06T23:55:47+05:30
71 డిమాండ్లకు స్పందన లేదు: బొప్పరాజు
కడప: ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు మండిపడ్డారు. 71 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. పీఆర్సీ అమలుపై జాప్యం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం 7 డీఏలను పెండింగ్లోనే పెట్టిందని చెప్పారు. ప్రభుత్వంలో దమ సమస్యలు వినే పరిస్థితి లేదన్నారు. ఉద్యోగులను సీఎం జగన్ సంక్షోభంలోకి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. అలాగే రేపటి నుంచి ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించాలని సూచించారు. ఉద్యోగుల 71 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
Updated Date - 2021-12-06T23:55:47+05:30 IST