రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN, First Publish Date - 2021-07-27T06:16:43+05:30
మండలంలోని హిర్దేహాళ్ - పు లకుర్తి గ్రామాల మధ్య ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్ర మాదంలో రాయదుర్గం మండ లం చదం గ్రామానికి చెందిన యువకుడు వెంకటేశ (30) మృతి చెందాడు.
డీ హీరేహాళ్, జూలై 26 : మండలంలోని హిర్దేహాళ్ - పు లకుర్తి గ్రామాల మధ్య ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్ర మాదంలో రాయదుర్గం మండ లం చదం గ్రామానికి చెందిన యువకుడు వెంకటేశ (30) మృతి చెందాడు. ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరా లివి. వెంకటేశ ద్విచక్ర వాహనంపై బళ్లారి వైపు నుంచి స్వగ్రామమైన చదం గ్రామానికి వెళ్తుండగా, కానుగవంక వద్ద రోడ్డు పక్కనే ఉన్న ప్రమాద హెచ్చరిక స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-07-27T06:16:43+05:30 IST