ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురుబలపై వైసీపీ అరాచకాలు ఆపాలి

ABN, First Publish Date - 2021-04-13T05:41:19+05:30

జిల్లాలో కురుబలపై వైసీపీ సాగిస్తున్న అరాచకాలు, దాడులను వెంట నే ఆపాలని కురుబ యువజన సం ఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ హెచ్చరించారు.

మాట్లాడుతున్న కురుబ యువజన సంఘం నాయకుడు రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుబ యువజన సంఘం నాయకుల హెచ్చరిక

అనంతపురం వైద్యం, ఏప్రిల్‌12: జిల్లాలో కురుబలపై వైసీపీ సాగిస్తున్న అరాచకాలు, దాడులను వెంట నే ఆపాలని కురుబ యువజన సం ఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ హెచ్చరించారు. స్థానిక జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక కురుబలపై అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ఆత్మకూరు మండలం బీ యాలేరులో ఓ కురుబ మహిళ జుట్టు కత్తిరించారన్నారు. వడియంపేటలో కురుబలు బయట కూర్చోరాదనీ, వారి గుడ్డలు కూడా రజకులు ఉతకకూడదని ఆంక్షలు పెట్టారన్నారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో ఓ కురుబ కులస్తుడికి చెందిన ఇల్లు కట్టకుండా బండలు నాటారన్నారు. అదే మండలంలో కురుబలకు చెందిన భూ వివాదంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తనయుడు జోక్యం చేసుకుని, మానసికంగా వేధిస్తున్నారన్నారు. ఇటీవల న్యాయవాది బిల్లే నరేంద్రపై ధర్మవరంలో వైసీపీ గూండాలు దాడి చేశారన్నారు. ఇలా జిల్లాలో వరుసగా కురుబలపై దాడులు, అరాచకాలకు వైసీపీ పాల్పడుతోందన్నారు. వీటిపై కురుబ సంఘం ఉద్యమ పంథాలో నిరసనలకు దిగుతుందని హెచ్చరించారు.

Updated Date - 2021-04-13T05:41:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising