దుకాణాలు స్వచ్చంధంగా మూసివేత
ABN, First Publish Date - 2021-05-06T06:26:03+05:30
కొవిడ్ ఉదృతి అధికం అవుతుండటంతో ప్రభుత్వం బుధవారంమధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిర్వహించింది.
హిందూపురం టౌన, మే 5: కొవిడ్ ఉదృతి అధికం అవుతుండటంతో ప్రభుత్వం బుధవారంమధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిర్వహించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టణంలో వస్తువులు, సరుకులు కొనుగోలు చేయడానికి జనం క్యూకట్టారు. కానీ 12 తరువాత దుకాణాలు స్వచ్చంధంగా మూసివేయడంతో ప్రజలంతా ఇళ్లకు చేరుకున్నారు. ఉదయం 6కే బయటికి వచ్చి కిరాణా వస్తువులు, నిత్యవసర సరుకులు, మందులు, తీసుకెళ్లారు. 12తరువాత జనం ఎవరికివారు వెళ్లిపోయారు. అయితే 12గంటలకు పోలీసులు రోడ్డెక్కి అటుగా వస్తున్నవారిని ప్రశ్నించి అనవసరంగా తిరుగుతున్న వారికి జరిమానా వేశారు.అంతేకాక నిబంధనలు అతిక్రమించి తిరుగుతున్నవారి వాహనాలను పోలీ్సస్టేషనకుతరలించారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కొన్నిమాత్రం సాయంత్రం వరకు జరిగినా మరికొన్ని మధ్యాహ్నంకే మూసివేశారు.
Updated Date - 2021-05-06T06:26:03+05:30 IST