రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలకు గాయాలు
ABN, First Publish Date - 2021-05-19T06:28:53+05:30
ఉపాధి పను లు ముగించుకుని ఇంటికి వెళుతూ ద్విచ క్రవాహనం అదుపుతప్పి కింద పడి ఇద్దరు ఉపాధి కూలీలు గాయపడ్డారు.
ధర్మవరంరూరల్, మే18: ఉపాధి పను లు ముగించుకుని ఇంటికి వెళుతూ ద్విచ క్రవాహనం అదుపుతప్పి కింద పడి ఇద్దరు ఉపాధి కూలీలు గాయపడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు గోవిందమ్మ మం గళవారం ఉపాధి పనులకు వెళ్లింది. పని ముగించుకుని సాటి కూలీ పోతలయ్య ద్విచక్రవాహనంలో ఇంటికి వస్తుండగా మ హాంకాళమ్మ గుడి ఆవరణలో వెనుక వైపు నుంచి వస్తున్న ఆటోకు సైడ్ ఇచ్చే ప్ర యత్నంలో అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో గోవిందమ్మకు తీవ్ర గాయాల య్యాయి. మరో కూలి పోతలయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయ పడిన గోవిందమ్మను ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనం తపురం తరలించారు. వైద్యుల సూచనలు మేరకు అక్కడి నుంచి కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ అశోక్కుమార్రెడ్డి, ఏపీఓ అనిల్కుమార్ రెడ్డి ఫోన ద్వారా గోవిందమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు.
Updated Date - 2021-05-19T06:28:53+05:30 IST