ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-01-26T07:01:13+05:30

మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిరెడ్డి (60) మృతి చెందాడు.

బాలిరెడ్డి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుత్తి రూరల్‌, జనవరి 25: మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిరెడ్డి (60) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. గుంతకల్లు మండలం గుర్రబ్బాడు గ్రామానికి చెందిన బాలిరెడ్డి తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో గుత్తికి వస్తుండగా, బ్రాహ్మణపల్లి శివారులో కుక్క అడ్డు రావడంతో కిందపడ్డాడు. ప్రమాదంలో బాలిరెడ్డి తీవ్రంగా గాయపడగా, స్థానికులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


చిన్నముష్టూరు వద్ద గొర్రెల కాపరి...

ఉరవకొండ : మండలంలోని చిన్నముష్టూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డ ప్రమాదంలో గొర్రెలకాపరి ఎర్రిస్వామి (60) మృతి చెందాడు. షేక్షానుపల్లికి చెందిన ఎర్రిస్వామి గొర్రెల మందతో అనంతపురం, బళ్లారిజాతీయ రహదారిపై వెళ్తుండగా ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ప్రమాదంలో ఎర్రిస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ ధరణిబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనదారులను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

పుట్లూరు, జనవరి 25: మండలంలోని ఎస్‌ తిమ్మాపురం బస్‌షెల్టర్‌ వద్ద సోమవారం  ఆర్టీసీ బస్సు ఢీకొని తాడిపత్రికి చెందిన వెంకటశివారెడ్డితో పాటు మరో మహిళ గాయపడ్డారు. తక్కళ్లపల్లి నుంచి తాడిపత్రికి ద్విచక్రవాహనంలో వస్తున్న వెంకటశివారెడ్డి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయాలపాలయ్యాడు. స్థానికులు   బాధితున్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ద్విచక్రవాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. అదేవిధంగా మండలంలోని సూరేపల్లిలో లారీఢీకొని లక్ష్మయ్య గాయపడ్డాడు. పుట్లూరుకు చెందిన లక్ష్మయ్య పనినిమిత్తం కొండాపురం వెళ్లి తిరిగి వస్తున్న నేపథ్యంలో సూరేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. బాధితున్ని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-01-26T07:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising