ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-01-16T06:26:28+05:30

పరిగి మండల కేంద్రం సమీపంలో షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలువపల్లికి చెందిన జగదీశ(22)అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

పరిగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగదీశ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమందేపల్లి, పరిగి మండలాల్లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో  ఇద్దరు మృతి చెందారు. సోమందేపల్లికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంలో వస్తూ డివైడర్‌ను ఢీకొని కింద పడ్డారు. ప్రమాదంలో దేవరాజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయ లయ్యాయి. పరిగి మండలంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో జగదీశ అక్కడికక్కడే మృతిచెండాడు. మరో ద్విచక్రవా హనదారుడు రాజేంద్రకు తీవ్రగాయాలయ్యాయి. 

  ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొని ఒకరు..

   సోమందేపల్లి(పెనుకొండ), జనవరి 15 : సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోమందేపల్లికి చెందిన దేవరాజ్‌(26) అతని స్నేహితులు శ్రీకాంత, జగదీశ ద్విచక్రవాహనంలో పాలసముద్రం నుంచి సోమందేపల్లికి వస్తుండగా డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో దేవరాజ్‌ అక్కడికక్కడే మృతిచెందగా అతని  స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స కోసం వెంటనే పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లితండ్రులు బోరున విలపించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని మరొకరు..

పరిగి(హిందూపురం టౌన): పరిగి మండల కేంద్రం సమీపంలో షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలువపల్లికి చెందిన జగదీశ(22)అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. జగదీశ ద్విచక్రవాహనంలో పరిగి నుండి కాలువపల్లికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో జగదీశ అక్కడికక్కడే మృతిచెందగా ఎదురుగా వస్దున్న ద్విచక్రవాహనదారుడు రాజేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై కేసు న మోదుచేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-01-16T06:26:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising