ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం : టీఎనఎస్‌ఎఫ్‌

ABN, First Publish Date - 2021-07-25T05:44:10+05:30

కర్నూల్లో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న టీటీసీ విద్యార్థి రమేష్‌ మృతికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హిందూపురం పార్లమెంట్‌ టీఎనఎస్‌ఎఫ్‌ ప్రఽధాన కార్యదర్శి కేపీ సల్మానఖాన ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చిలమత్తూరు, జూలై 24: కర్నూల్లో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న టీటీసీ విద్యార్థి రమేష్‌ మృతికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హిందూపురం పార్లమెంట్‌ టీఎనఎస్‌ఎఫ్‌ ప్రఽధాన కార్యదర్శి కేపీ సల్మానఖాన ఆరోపించారు. శనివారం ఆయన మండల కేంద్రంలో స్థానిక టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు సురేంద్రయాదవ్‌, సాయి, హర్ష, రవికుమార్‌ తదితరలతో కలిసి మాట్లాడారు. వైఎస్‌ జగన్మోహనరెడ్డి అవలంభిస్తున్న విధానాలు విద్యార్థి, యువత, నిరుద్యోగు యువతకు గొడ్డలిపెట్టుగా మారాయన్నారు. దాంతోనే కర్నూల్లో టీటీసి విద్యార్థి రమేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రమేష్‌ ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా భావించి అతని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయాలన్నారు. దాంతో పాటు ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. ప్రభుత్వం కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసే వరకు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పోరాటం  చేస్తూనే ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి మెడలు వంచైనా యువతకు, విద్యార్థులకు మేలు జరిగేటట్లు చేస్తామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని యవకులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.


Updated Date - 2021-07-25T05:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising