ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విత్తన నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు

ABN, First Publish Date - 2021-10-17T07:04:51+05:30

పప్పుశనగ విత్తననాణ్యతలో ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని, రైతులకు నాణ్యమైన విత్తనాలను ఖచ్చితమైన తూకాలతో అందిస్తా మని జేడీఏ చంద్రనాయక్‌ పేర్కొ న్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేడీఏ చంద్రనాయక్‌

ధర్మవరంరూరల్‌, అక్టోబరు 16: పప్పుశనగ విత్తననాణ్యతలో ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని, రైతులకు నాణ్యమైన విత్తనాలను ఖచ్చితమైన తూకాలతో అందిస్తా మని జేడీఏ చంద్రనాయక్‌ పేర్కొ న్నారు. శనివారం పట్టణంలోని శ్రీసాయిసీడ్స్‌, విజేత అగ్రిటెక్‌ పప్పుశనగ ప్రాసెసింగ్‌ కేంద్రాలను జిల్లా ఏపీ సీడ్స్‌ మేనేజర్‌ ధనలక్ష్మీతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో శ్రీ సాయు సీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ వారి రికార్డులు సరిగ్గా లేకపోవడంతో 100 క్వింటాళ్ల పప్పుశనగను విక్రయాలు సాగించకుండా నిలుపుదల చేశారు. అదేవిధంగా విత్తనాల నాణ్యత, తూకాలు, రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు నాణ్య మైన విత్తనాలు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఏ రైతుకు కూడా నష్టం జరగకూడదన్నారు. స్థానిక అధికారులు కూడా ఎప్ప టికప్పుడూ ప్రాసెసింగ్‌ను పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏడీఏ క్రిష్ణయ్య, ఏఓ చన్నవీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T07:04:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising