దున్నపోతును బందించిన గ్రామస్థులు
ABN, First Publish Date - 2021-06-28T04:53:01+05:30
ఎనుముల కాపరి నారాయణ మృతికి కారణమైన దున్నపోతును రొద్దం గ్రామస్థులు బంధించారు.
రొద్దం, జూన 27: ఎనుముల కాపరి నారాయణ మృతికి కారణమైన దున్నపోతును రొద్దం గ్రామస్థులు బంధించారు. శనివారం సాయంత్రం మేపుకోసం ఎనుములను పొలాల్లోకి తోలుకెళ్లిన నారాయణ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ఆంబోతు నాలుగు మార్లు పైకి లేపుతూ కుమ్మింది. దీంతో ఎనుముల కాపరి మృతిచెందాడు. దున్నపోతు యజమాని బోయ రామాంజి సహాయంతో ఆదివారం గ్రామస్థులు దున్నపోతును పెద్దపెద్ద తాళ్ళతో బంధించి ట్రాక్టర్కు కట్టి మారెమ్మ దేవాలయం వద్దకు తీసుకు వచ్చి టెంకాయ చెట్టుకు కట్టేశారు. పావగడ, పెనుకొండ ప్రధాన రహదారి పక్కనే దున్నపోతును బంధించడంతో జనం తండోపతండాలుగా వచ్చి తిలకించారు. అయితే దున్నపోతును మంగళవారం మారెమ్మదేవతకు బలిచ్చేందుకు గ్రామస్థులు సన్నద్దం అవుతున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-06-28T04:53:01+05:30 IST