కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
ABN, First Publish Date - 2021-06-18T06:17:09+05:30
కరోనా రెండో విజృంభించి ప్రజలను నానాఇబ్బందులకు గురి చేసినా ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకులు అన్నారు.
కొత్తచెరువు, జూన 17: కరోనా రెండో విజృంభించి ప్రజలను నానాఇబ్బందులకు గురి చేసినా ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకులు అన్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అందరికి వ్యాక్సిన ఇచ్చి ప్రజల ప్రాణాలను కాపా డాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని, ఆక్సిజన అందక మృతి చెందిన కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాక కరోనా సమయంలో చిరువ్యాపారస్థులు ఆర్థికంగా చితికిపోయారని వారిని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామక్రిష్ణ, కో కన్వీనర్ శ్రీనివాసులు,టీడీపీ నాయకులు గాజుల చంద్రమోహన, రాజప్ప, సుబ్బరాయుడు, పెద్దన్న, మైనార్టీనాయకులు సైకిల్షాపు బాబా చికెన సెంటర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-18T06:17:09+05:30 IST