గాలించినా లభ్యంకాని యువకుడి మృతదేహం
ABN, First Publish Date - 2021-05-17T05:37:22+05:30
అచ్చీమియా దర్గా దర్శనం కోసం వచ్చి, అనంతరం గ్రామసమీపంలోని పెద్దబావిలో ఈతకు వెళ్ళి
ఓబుళదేవరచెరువు, మే 16: అచ్చీమియా దర్గా దర్శనం కోసం వచ్చి, అనంతరం గ్రామసమీపంలోని పెద్దబావిలో ఈతకు వెళ్ళి కనపడని తాడిపత్రికి చెందిన షేక్ మహమ్మద్ మున్నా కోసం ఆదివారం ఎస్ఐ కేఎం లింగన్న, ఫైర్ ఇనచార్జ్ ఎస్ఐ శివ రామిరెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది ఉత్తమ్రెడ్డి, వన్నూరప్ప, మహబూబ్బాషా, రమణప్ప, రమనానాయక్లు బావి మొత్తం గంటల తరబడి గాలించినా ఆ యువకుడి మృతదేహం లభ్యం కాకపోవడంతో వెనుతిరిగారు. బావిలో పడ్డ 30 గం టలలోగా మృతదేహం పైకి తేలుతుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ గాలింపు చర్య లలో ఏఎస్ఐ నీలకంఠ, పోలీసులు అస్లాం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-05-17T05:37:22+05:30 IST