రాప్తాడులో పరిటాల శ్రీరామ్ నిరసన
ABN, First Publish Date - 2021-09-14T18:01:44+05:30
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రాప్తాడులో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ నిరసనకు దిగారు.
అనంతపురం: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రాప్తాడులో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ నిరసనకు దిగారు. రైతులతో కలిసి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమంలో శ్రీరామ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీరామ్ టమోటా బాక్సులను మోశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఏ ఒక్క విషయంలో కూడా న్యాయం జరగలేదని ఆయన మండిపడ్డారు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రిప్పు, స్ప్రింక్లర్లు ఎందుకు ఇవ్వడం లేదని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు.
Updated Date - 2021-09-14T18:01:44+05:30 IST