కాల్వ శ్రీనివాసులు కోసం పోలీసుల ముమ్మర గాలింపు
ABN, First Publish Date - 2021-08-28T16:01:38+05:30
టీడీపీ రాష్ట్ర పొలిట్బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చేపట్టనున్న పాదయాత్రతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అనంతపురం: టీడీపీ రాష్ట్ర పొలిట్బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చేపట్టనున్న పాదయాత్రతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంపు ధరలకు నిరసనగా ఉద్దేహాల్ గ్రామం నుంచి బొమ్మన హాల్ మండల కేంద్రం వరకు కాల్వ శ్రీనివాసులు పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో టీడీపీ నేత పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాల్వ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పాదయాత్రను అడ్డుకునేందుకు ఉద్దేహళ్ గ్రామం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. అడుగడుగున వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాదయాత్రకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పాదయాత్రకు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
Updated Date - 2021-08-28T16:01:38+05:30 IST