లోక్ అదాలతను సద్వినియోగం చేసుకోవాలి : జడ్జి
ABN, First Publish Date - 2021-10-29T05:59:24+05:30
మండల ప్రజలు లో క్ అదాలతను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి లావణ్య పిలుపునిచ్చారు.
మాట్లాడుతున్న జూనియర్ సివిల్ జడ్జి లావణ్య
రాయదుర్గం రూరల్, అక్టోబరు 28: మండల ప్రజలు లో క్ అదాలతను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి లావణ్య పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని వడ్రవన్నూరు గ్రామంలో మండల న్యాయసేవాసమితి ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు ని ర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ గ్రా మాలలో ప్రతిఒక్కరు చట్టాలపై అవగాహన చేసుకోవాలన్నారు. తగాదాలతో భవిష్యత్తు ను, సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. ఆడపిల్లలను చదివించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రవిచంద్ర, వెంకటరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T05:59:24+05:30 IST