ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో కాపరి, గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2021-06-14T06:06:29+05:30

మండలంలోని ఆర్‌కొత్తపల్లి సమీపంలోని మనుకొండ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదంలో కాపరి, 15 గొర్రెలు మృతిచెందాయి.

గొర్రెల కాపరి పోతన్న మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



రామగిరి, జూన్‌ 13: మండలంలోని ఆర్‌కొత్తపల్లి సమీపంలోని మనుకొండ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదంలో కాపరి, 15 గొర్రెలు మృతిచెందాయి. నసనకోట గ్రామానికి చెందిన కాపరి బోయ పోతన్న (48) గొర్రెలను తోలుకుని వెళ్తుండగా అదే ఊరికి చెందిన రామలింగారెడ్డి సుమో వాహనంలో వస్తూ అదుపు తప్పి, కాపరితోపాటు, గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. కాపరి పోతన్నతోపాటు 15 గొర్రెలు మృతిచెందాయి. పోతన్న గొర్రెలను ఈత వేసేందుకు తెల్లవారుజామునే వెళ్తుండగా.. రామలింగారెడ్డి కుమార్తె కోసం సమోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే పోతన్న భార్య చిన్నక్క, కుమార్తెలు ముత్యాలమ్మ, త్రిష, బంధువులు, అక్కడికి చేరుకుని, కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐ నాగాస్వామి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2021-06-14T06:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising