ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యో.. పూజే.. పూజారిని బలిగొందా..!

ABN, First Publish Date - 2021-08-21T19:49:51+05:30

అనంతపురం: దేవుని పూజలో నిత్యం తరించే ఆ పూజారిని.. అదే పూజ బలిగొంటుందని ఎవరూ ఊహించలేదు. జిల్లాలోని శింగనమల సమీపంలో గంపమల్లయ్య స్వామి కొండపై శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: దేవుని పూజలో నిత్యం తరించే ఆ పూజారిని.. అదే పూజ బలిగొంటుందని ఎవరూ ఊహించలేదు. జిల్లాలోని శింగనమల సమీపంలో గంపమల్లయ్య స్వామి కొండపై శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుమల ఏడుకొండలకు మారు పేరుగా ఈ స్వామిని భక్తులు పూజిస్తూ ఉంటారు. భక్తులకు కనిపించని దేవుడు.. పూజారికి మాత్రమే కనిపిస్తాడు అని ప్రజల విశ్వాసం. ఆయనలోనే దేవుడిని చూసుకుంటూ పూజలు చేస్తుంటారు. 


 శ్రావణమాసం కావడంతో స్వామికి పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ పాపయ్య అనే వ్యక్తి.. స్వామికి వంశపారంపర్యంగా పూజలు చేస్తూ ఉంటారు. శనివారం కూడా యథావిధిగా పూజ చేస్తున్నారు. ఈ క్రమంలో కొండ పైనుంచి గుహలోకి దిగే క్రమంలో ఒక్కసారిగా కాలు జారి లోయలో పడ్డాడు. భక్తులందరూ చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. ఊహించని ఈ ప్రమాదానికి అక్కడున్న భక్తులంతా షాక్ అయ్యారు. పూజారి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. నిత్యం స్వామి పూజలో తరించే ఆ పూజారి.. అదే పూజలో ఉండగానే మృతి చెందడాన్ని భక్తులు జీర్ణించుకోలేకున్నారు.

Updated Date - 2021-08-21T19:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising