ఆందోళనలో వేరుశనగ రైతు
ABN, First Publish Date - 2021-09-29T06:01:45+05:30
ప్రస్తుతం కాయలు గింజలు పట్టే దశలో ఉన్న వేరుశనగ పంట వర్షాలు లేక ఎండుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తనకల్లు, సెప్టెంబరు 28 : ప్రస్తుతం కాయలు గింజలు పట్టే దశలో ఉన్న వేరుశనగ పంట వర్షాలు లేక ఎండుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పది రోజుల్లో వాన రాకుంటే ఇక పంట పై ఆశ వదులుకోవాల్సిందేనని వాపోతున్నారు. గత ప్రభుత్వం పంటలు ఎండిపోయే సమయంలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి.. ఆదుకుందని, కాని ప్రస్తుత ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.
Updated Date - 2021-09-29T06:01:45+05:30 IST