ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
ABN, First Publish Date - 2021-12-02T06:14:06+05:30
ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని జి ల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన తె లిపారు.
: కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన
రాప్తాడు, డిసెంబరు 1: ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని జి ల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన తె లిపారు. రాప్తాడు మండలంలోని చెర్లోపల్లిలో రైతు చంద్రశేఖర్ పొ లంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పలు రకాల పంటల ను ఆమె బుధవారం పరిశీలించా రు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీపీఎం లక్ష్మనాయక్ మాట్లాడుతూ జిల్లాలో 86 యూనిట్లలో రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటలు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-02T06:14:06+05:30 IST