ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 మంది సచివాలయ సిబ్బందికి మెమోలు

ABN, First Publish Date - 2021-04-21T06:04:53+05:30

నగరంలోని 1, 5, 7 సచివాలయాల పరిధిలోని తొమ్మిది మంది సిబ్బందికి మంగళవారం అధికారులు మెమోలు జారీ చే శారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విధుల్లో అలసత్వంపై మేయర్‌ ఆగ్రహం 

అనంతపురం కార్పొరేషన, ఏప్రిల్‌ 20: నగరంలోని 1, 5, 7 సచివాలయాల పరిధిలోని తొమ్మిది మంది సిబ్బందికి మంగళవారం అధికారులు మెమోలు జారీ చే శారు. విధుల్లో అలసత్వం వహించడంపై నగరపాలక సంస్థ మేయర్‌ వసీం సలీమ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆయా సచివాలయాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా పలువురు సిబ్బంది కార్యాలయాల్లో ఉండకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రిజిష్టర్‌ తనిఖీ చేయగా... అందులో ఎ క్కువ మంది ఫీల్డ్‌కు వెళ్లినట్లు రాయడంపై మేయర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వి ధుల్లో లేని వారికి మెమోలు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. అయితే కార్పొరేషన కార్యాలయంలో మెమోలు జారీ చేయకుండా కొందరు నొక్కిపెట్టడానికి ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఎట్టకేలకు మేయర్‌  పట్టుపట్టడంతో మెమోలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఒకటవ సచివాలయంలోని దాదాపీర్‌, మాధవీలత, సాయిశ్వేత, ఐదో సచివాలయంలోని జనార్దనరాజు, ప్రసాద్‌, తనూజ్‌కుమార్‌, ఏడో సచివాలయంలోని గంగాధర, అపర్ణ, రవళిలకు మెమోలు జారీ చేశారు. 

Updated Date - 2021-04-21T06:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising