ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయండి
ABN, First Publish Date - 2021-10-19T06:20:24+05:30
మండల కేంద్రంలోని డ్యాం రోడ్డు సమీపంలో మంగళవారం నిర్వహిం చనున్న శింగనమల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి పిలుపునిచ్చారు.
: ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి
గార్లదిన్నె, అక్టోబరు18 : మండల కేంద్రంలోని డ్యాం రోడ్డు సమీపంలో మంగళవారం నిర్వహిం చనున్న శింగనమల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆత్మీయకలయిక కార్యక్రమ ఏర్పాట్లను ఆ యన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆత్మీయ కలయిక కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
శింగనమల: గార్లదిన్నెలో మంగళవారం జరిగే టీడీపీ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని టీడీపీ శింగనమల నాయకులు దండు శ్రీనివాసులు సోమవారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అఽధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2021-10-19T06:20:24+05:30 IST