ఎస్టీ సాధనకు ప్రధానికి లక్ష వినతులు
ABN, First Publish Date - 2021-10-21T06:12:10+05:30
వాల్మీకి మహర్షి స్ఫూర్తితో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లక్ష వినతులు పంపే ఉద్యమాన్ని చేపట్టినట్లు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసు లు పేర్కొన్నారు.
అనంతపురం క్లాక్టవర్, అక్టోబరు 20: వాల్మీకి మహర్షి స్ఫూర్తితో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లక్ష వినతులు పంపే ఉద్యమాన్ని చేపట్టినట్లు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసు లు పేర్కొన్నారు. వాల్మీకి జ యంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక పాతూరులోని పవరాఫీస్ వద్ద ఉన్న మహర్షి విగ్రహానికి కాలవ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ప్రధానికి లక్ష వినతుల కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి స్ఫూర్తితో ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, వాల్మీకిబోయ సంఘాల నాయకులు పెనుకొండ ఈశ్వరయ్య, కూడేరు బ్రహ్మయ్య, రామచంద్ర, సేవాదళ్ అక్కులప్ప, వాల్మీకి ఉద్యోగులసంఘం అక్కులప్ప, న్యాయవాది గంగాధర్, క్రాంతినాయుడు, గుంతకల్లు పెద్దన్న పాల్గొన్నారు.
Updated Date - 2021-10-21T06:12:10+05:30 IST