కరోనా దెబ్బకు ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ
ABN, First Publish Date - 2021-05-21T06:19:30+05:30
కరోనా దెబ్బతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలలాడుతున్నాయి.
నిర్మానుష్యంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయం
లేపాక్షి, మే 20 : కరోనా దెబ్బతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలలాడుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు మాత్రమే ప్రత్యేక అవసరాల కోసం సడలింపు ఇవ్వడంతో ప్రజలు ఆ సమయాన్ని నిత్యావసర వస్తువులు కొనుగోలుకే కేటాయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు సాహసించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కొంతమందికి పాజిటివ్ రావడంతో సిబ్బంది కూడా అరకొరగా విధులకు వస్తున్నారు. రైతులు 1బి కోసం, పాసుపుస్తకాల కోసం కూడా కార్యాలయాలవైపు వెళ్లడం లేదు.
Updated Date - 2021-05-21T06:19:30+05:30 IST