ఘనంగా వంగవీటి మోహన రంగ జయంతివేడుకలు
ABN, First Publish Date - 2021-07-05T05:21:06+05:30
నగరంలోని శ్రీ బాలాజీ క ల్యాణమండపంలో ఆదివారం రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 74వ జయంతి వేడుకలను ఘ నంగా నిర్వహించారు.
అనంతపురం క్రైం, జూలై 4: నగరంలోని శ్రీ బాలాజీ క ల్యాణమండపంలో ఆదివారం రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 74వ జయంతి వేడుకలను ఘ నంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూల మా లలు వేసి నివాళి అర్పించారు. ఆయన అందించిన సేవలను స్మరించు కున్నారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు బళ్ళారి వెంకట్రాము డు, ప్రధాన కార్యదర్శి విజయబాస్కర్, కోశాధికారి భ వానీ రవికుమార్, కార్యదర్శి కోనేటి సాయిప్రసాద్, శ్రీధర్, సహాయ కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, గల్లా హర్ష, కార్యవర్గ సభ్యులు శ్రీకృష్ణ, విజయ్, సుంకర ఫణి, చలపతి, ప్రభాకర్, మున్న తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంరూరల్: కాపు, బలిజ, తెలగ పోరాట సమితి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. టవర్క్లాక్ వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఈకార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి, వంగవీటి మోహన రంగా చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ సాగర్ రాయల్, సాయిరాయల్, శేఖర్, చరణ్, అశోక్, కిషోర్, శంకర్, అనిల్, మంజు, వినయ్, శివ, గుణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-05T05:21:06+05:30 IST