ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగునీటి కోసం సీమ నేతలు సమైక్యంగా పోరాటం చేయాలి: Amarnath

ABN, First Publish Date - 2021-09-11T17:37:34+05:30

రాజశేఖర్ రెడ్డి మిగులు జలాలపై హక్కును వదులుకుంటున్నామని చెప్పడంతోనే రాయలసీమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాజశేఖర్ రెడ్డి మిగులు జలాలపై హక్కును వదులుకుంటున్నామని  చెప్పడంతోనే రాయలసీమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి అన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీమ నేతల సదస్సులో ఆయన మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లాలో ఎలాంటి పనులు జరగడం లేదన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు స్టేట్మెంట్లు ఇవ్వడం మినహా ఏమీ చేయడం లేదని విమర్శించారు. చెరువుల్లో నీరు నింపితే ఇసుక తరలించడం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టు పనుల కోసమే వైసీపీ నేతలు పనులు చేస్తున్నారన్నారు. దీనిపై జిల్లాలో ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తున్నట్లు చెప్పారు.  కుప్పం నియోజకవర్గం నుంచే పాదయాత్ర చేపడుతున్నామన్నారు. సాగు నీటి సాధన కోసం రాయలసీమ జిల్లా టీడీపీ నేతలు అందరూ కూడా సమైక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అమర్నాథరెడ్డి పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-09-11T17:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising