ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాయలసీమ’లో అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2021-12-06T06:31:53+05:30

తిరుపతి-నిజామాబాద్‌ వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 12793)లోని ఓ బోగీలో నిప్పురవ్వలు ఎగసిపడగా సిబ్బంది అప్రమత్తమై రైలును ఆపి మంటలను ఆర్పేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తప్పిన భారీ నష్టం

గుంతకల్లు, డిసెంబరు 5: తిరుపతి-నిజామాబాద్‌ వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 12793)లోని ఓ బోగీలో నిప్పురవ్వలు ఎగసిపడగా సిబ్బంది అప్రమత్తమై రైలును ఆపి మంటలను ఆర్పేశారు. ఆదివారం రాత్రి ఓబుళవారిపల్లి-రెడ్డిపల్లి స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రైలు చివరి బోగీలో ఉన్న ఏసీ కార్‌కు కింద భాగాన సాంకేతిక సమస్య ఏర్పడి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. మంట కారణంగా ఈ బోగీకి ఆనుకుని ఉన్న మూడు ఏసీ కోచలలో పొగ వ్యాపించింది. దీంతో ఏసీ బోగీల్లోని ప్రయాణికులు భయాందోళన చెందారు. గమనించిన గార్డు రైలును ఆపివేయగా, సిబ్బంది మంటలను ఆర్పి, ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించారు. దాదాపు 45 నిమిషాలసేపు రైలు నిలిచిపోయింది. సమస్య పరిష్కారం కావడంతో రైలును ముందుకు నడిపారు. ఎవరికీ ఎటు వంటి ప్రమాదం జరగలేదు. భారీ నష్టం తప్పడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2021-12-06T06:31:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising