ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలంలోకూలీ మృతి

ABN, First Publish Date - 2021-12-26T05:32:26+05:30

వ్యవసాయ కూలీ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు రామాంజనేయులు(40) పంట పొలంలోనే మృతిచెందిన సంఘటన మండలంలోని సత్తారుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

సంఘటనా స్థలంలో రైతు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ రూరల్‌, డిసెంబర్‌ 25: వ్యవసాయ కూలీ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు రామాంజనేయులు(40) పంట పొలంలోనే మృతిచెందిన సంఘటన మండలంలోని సత్తారుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉప్పర రామాంజినేయులు పంట పొలాల్లో కూలీ పనిచేస్తు కుటుంబం పోషించేవాడు. ఈ తరుణంలో శుక్రవారం రోజూవారీలాగా సత్తారుపల్లిలో రైతు రఘునాథ్‌రెడ్డి పంట పొలంలో మొక్కజొన్న పంట వేసేందుకు రామాంజనేయులు వెళ్లాడు. తోటి కూలీలతో కలిసి శుక్రవారం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. శనివారం ఉదయం రైతులు పొలంవద్దకు వెళ్లి చూడగా రామాంజినేయులు మృతిచెందడం గుర్తించి బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రమే్‌షబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.





Updated Date - 2021-12-26T05:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising