ఆదాయం కోసం మద్యం తాపుతారా..?
ABN, First Publish Date - 2021-08-03T06:59:30+05:30
ఆదాయం కోసం మద్యం షాపులు పెంచి, మందు తాపుతారా అని ప్రభుత్వంపై టీడీపీ అనంత నియోజకవర్గ అధికార ప్రతినిధి గోపాల్గౌడ్ మండిపడ్డారు
టీడీపీ అధికార ప్రతినిధి గోపాల్గౌడ్
అనంతపురం వైద్యం, ఆగస్టు2: ఆదాయం కోసం మద్యం షాపులు పెంచి, మందు తాపుతారా అని ప్రభుత్వంపై టీడీపీ అనంత నియోజకవర్గ అధికార ప్రతినిధి గోపాల్గౌడ్ మండిపడ్డారు. నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ‘మద్యంపై రివర్స్గేర్’ కథనాన్ని చూపుతూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం తెస్తానని చెప్పిన జగన్.. అధికారం చేపట్టాక ఆదాయమే పరమావధిగా మద్యం షాపులు పెంచి, విచ్చలవిడిగా జనానికి తాపాలని అనుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2700 షాపులున్నాయనీ, ఇప్పుడు పర్యాటక కేంద్రాల్లో మరో 300 బార్ వాకింగ్ స్టోర్స్ పేరుతో ఏర్పాటు చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. మద్యంపై మాట తప్పిన సీఎం జగన్ పాలనకు అనర్హుడని మండిపడ్డారు.
Updated Date - 2021-08-03T06:59:30+05:30 IST