శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN, First Publish Date - 2021-01-17T06:20:07+05:30
పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఉదయం నుంచి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.
కదిరి , జనవరి 16 : పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఉదయం నుంచి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. క్యూలో భక్తులు వేలాది మంది స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. ఇటు వందరూపాయలు క్యూలో కూడా భక్తుల రద్దీ కనిపించింది. గోవింద నామస్మరణ మధ్య భక్తులు స్వామివారితో పాటు అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. కరోనా సందర్భంగా ఆలయ అధికారులు నిత్య అన్నదానం రద్దు చేశారు. అయితే భక్తులకు ఆలయ అధికారులు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
Updated Date - 2021-01-17T06:20:07+05:30 IST