ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతదేహంతో దళితుల ధర్నా

ABN, First Publish Date - 2021-08-27T22:57:11+05:30

అనంతపురం: తమకు స్మశాన స్థలం చూపించాలని డిమాండ్ చేస్తూ.. లేపాక్షిలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం మృతదేహంతో దళితులు ధర్నా చేశారు. కొండూరు గ్రామం నుంచి మృతదేహాన్నిలేపాక్షి మండల కేంద్రానికి తీసుకువచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: తమకు స్మశాన స్థలం చూపించాలని డిమాండ్ చేస్తూ.. లేపాక్షిలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం మృతదేహంతో దళితులు ధర్నా చేశారు. కొండూరు గ్రామం నుంచి మృతదేహాన్ని లేపాక్షి మండల కేంద్రానికి తీసుకొచ్చారు. మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారి మధ్య తోపులాట జరిగింది.


అనంతరం తహసీల్దారు కార్యాలయం ఎదుట మృతదేహంతో బైఠాయించారు. వారు మాట్లాడుతూ లేపాక్షి మండలం కొండూరులో స్మశాన వాటిక స్థలాన్ని స్థానిక వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి పేరుతో రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చారని, దీంతో అంత్యక్రియలకు దళితులు వెళ్లకుండా సదరు నేత అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చనిపోయిన వారిని ఎక్కడ ఖననం చేయాలని ప్రశ్నించారు. స్మశాన స్థాలనికి పట్టా ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేసే వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించుకున్నారు.

Updated Date - 2021-08-27T22:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising