ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం: బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం..

ABN, First Publish Date - 2021-09-30T16:04:22+05:30

అనంతపురం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ నరసింహులు ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోందంటూ ప్రతిపక్షం ఇప్పటికే ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను కలిసి అనేకసార్లు వినతి పత్రం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ వికలాంగ కాంట్రాక్టర్ నరసింహులు బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్బంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన హెడ్‌లైన్ షోలో కాంట్రాక్టర్ నరసింహులు మాట్లాడుతూ.. రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టి పనులు చేశామన్నారు. దీనికి గాను పంచాయతీ గ్రాంట్ రూ. 2 లక్షల 80వేల 6 వందలు వచ్చాయన్నారు. మిగిలిన డబ్బులు ఇవ్వకుండా అధికారులు తిప్పుతున్నారని, అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు వాళ్లు ఇంటికి వస్తున్నారని, బిల్లులు ఇవ్వాలని బ్రతిమిలాడినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను మనస్తాపం చెంది ఎంపీడీవో కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని నరసింహులు ఏబీఎన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-09-30T16:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising