టీడీపీ బలోపేతానికి సమష్టి కృషి: మాజీ ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2021-09-29T05:42:55+05:30
మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతా నికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని గుంతకల్లు మాజీ శాసన సభ్యులు జితేంద్రగౌడ్ పేర్కొన్నారు.
పామిడి, సెప్టెంబరు 28: మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతా నికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని గుంతకల్లు మాజీ శాసన సభ్యులు జితేంద్రగౌడ్ పేర్కొన్నారు. స్థానిక ఎద్దులపల్లి రోడ్డులోని తెలుగు రైతు విభాగం పార్లమెంట్ అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మీనారాయణ రె డ్డి గృహంలో మంగళవారం ఆయన టీడీపీ మండల నాయకులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకు మండల నాయకులు కలిసికట్టుగా శ్రమించాలన్నారు. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాలన్నారు. కార్యకర్తలకు అండగా నిలవాలన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికలలో టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. మండలంలోని రామగిరి ఎగువ తండా గ్రామానికి చెందిన పలువురు నా యకులపై పోలీసుస్టేషనలో కేసులు నమోదు చేయడంతో వారిని పరామర్శించి మనోధైర్యం నింపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన గౌస్పీరా, మాజీ కౌన్సిలర్లు వైయూ రామాంజనేయులు, టీటీ రమణారావు, మాజీ ఎంపీటీసీ జయకుమార్, టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి రాజే్షనాయ క్, మండల ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు బొమ్మా మోహనకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-29T05:42:55+05:30 IST