ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెలుపును జీర్ణించుకోలేకే జేసీపీఆర్‌పై కేసులు

ABN, First Publish Date - 2021-08-04T06:48:53+05:30

తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలుపును జీర్ణించుకోలేకే మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకరరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి, వేధిస్తున్నారని రాష్ట్ర మాంసపు ఉత్పత్తుల సంస్థ మాజీ అధ్యక్షుడు చంద్రదండు ప్రకా్‌షనాయుడు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ నియంత పాలనపై తిరుగుబాటు 

చంద్రదండు ప్రకా్‌షనాయుడు ధ్వజం

అనంతపురం వైద్యం, ఆగస్టు 3: తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలుపును జీర్ణించుకోలేకే మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకరరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి, వేధిస్తున్నారని రాష్ట్ర మాంసపు ఉత్పత్తుల సంస్థ మాజీ అధ్యక్షుడు చంద్రదండు ప్రకా్‌షనాయుడు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపాలిటీలో ఒక్కటే వైసీపీ అరాచకాలను ఎదురించి, జనం టీడీపీకి పట్టం కట్టారన్నారు. జేసీ కుటుంబంపై జనంలో ఉన్న ఆదరణతోనే ఇది సాధ్యమైందన్నారు. అందుకే అధికార పార్టీ.. జేసీ కుటుంబాన్ని వివిధ రకాలుగా కేసులు పెట్టి, ఇబ్బందులు పెడుతోందన్నారు. అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. మున్సిపల్‌ అధికారులు.. చైర్మనకు సహకారం అందించకపోవడం మరీ అన్యాయమన్నారు. దేశంలోనే తాడిపత్రి మున్సిపాలిటీని ఆదర్శంగా నిలిపారనీ, అవార్డులు కూడా పొందారన్నారు. అలాంటి నాయకుడు జేసీపీఆర్‌కు అధికారులు మద్దతు ఇవ్వకపోవడంపై ఉన్నతాధికారులు సీరియ్‌సగా స్పందించి, చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నియంత పాలనపై త్వరలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సమావేశంలో చంద్రదండు నాయకులు మహమ్మద్‌ రఫీ, సుధాకర్‌, నరేష్‌, నారాయణస్వామి, జాకీర్‌, సుబాన పాల్గొన్నారు.


Updated Date - 2021-08-04T06:48:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising