ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సులో బీటెక్‌ విద్యార్థి మృతి కలకలం

ABN, First Publish Date - 2021-07-28T06:49:50+05:30

నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి అనుమాన్పాద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

మృతి చెందిన కేశవయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, జూలై 27 : నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి అనుమాన్పాద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. త్రీటౌన్‌ పోలీ సులు తెలిపిన మేరకు..పామి డి మండలం పామిడి కొండా పురం గ్రామానికి చెం దిన కేశవయ్య(26) విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఇం జనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం ఉండ టంతో సోమవారం రాత్రి విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులో అనంతపురం బయల్దేరాడు. మంగళవారం ఉద యం 7.30 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లోని కార్గో పార్శిల్‌ వద్దకు బస్సు చేరుకుంది. ప్రయాణికులందరూ  దిగిపోయారు.  కేశవయ్య మాత్రం తన సీటులోనే స్థిమితం లేకుండా పడి ఉండటంతో గమనించిన బస్సు డ్రైవర్‌, కండెక్టర్‌లు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. స్పృహ లేకుండా ఉండటంతో అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంగా సోదరుడికి ఫోన్‌ చేసి విషయం తెలిపారు. సోదరుడితో పాటు త్రీటౌన్‌ పోలీసులు, ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకుని కేశవయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. అనారోగ్యంతో ఉండటంతోనే మృతి చెంది ఉంటాడని మృతుడి సోదరుడు కన్నీటి పర్యంతమయ్యారు. 


Updated Date - 2021-07-28T06:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising