రక్తదాతలే ప్రాణదాతలు
ABN, First Publish Date - 2021-06-15T06:31:08+05:30
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జేఎల్ మురళి రాయల్యూత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
అనంతపురం వైద్యం, జూన14: ప్రాణాలు కాపాడే రక్తదాతలే ప్రాణ దాతలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జేఎల్మురళీధర్ పేర్కొన్నారు. ప్రపంచ రక్త దా తల దినోత్సవ సందర్భంగా సోమవారం ఎనటీఆర్మార్గ్ వద్ద ఉన్న మాస్టర్ మైండ్స్ డిగ్రీ కళాశాలలో రాయల్యూత ఆధ్వర్యంలో రెడ్క్రాస్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 40 మంది యువకులు రక్తదానం చేశా రు. కార్యక్రమానికి జేఎల్ మురళీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అనేక మంది ఆపత్కాలంలో రక్తం అందక మృత్యువాత ప డుతున్నారన్నారు. అలాం టి వారికి రక్తదానం చేసేవారే నిజమైన ప్రాణదా తలన్నారు. కార్యక్రమంలో రాయల్యూత అధ్యక్షుడు సుంకరరమేష్, ప్రగతిపథం సంస్థ అధ్యక్షుడు భరత, ఎనవైకే డీడీఓ శ్రీనివాసులు, తోటనాగరాజు, సునీల్, మితున, గంగాద్రి, అబ్దుల్, శైలు, హరినాథ్, సుబ్బు, విజయసాయి, రెడ్క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-06-15T06:31:08+05:30 IST