ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్వచ్ఛసంకల్పం’ అమలుకు సన్నద్ధం కండి

ABN, First Publish Date - 2021-08-25T05:41:53+05:30

జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలు కు సన్నద్దం కావాలనీ, అందుకు కా వాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి.. ఈఓఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డి


అనంతపురం రైల్వే, ఆగస్టు 24: జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలు కు సన్నద్దం కావాలనీ, అందుకు కా వాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి.. ఈఓఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో ఈఓఆర్డీలు, మేజర్‌ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. తొలుత గత వారంలో అనారోగ్యంతో మృతిచెందిన డీఎల్‌పీఓ రమణ చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు. అ నంతరం జడ్పీ సీఈఓ మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛసంకల్పం ప్రారంభంలోపు అందు కు కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలన్నారు. ఇందులో ఈఓఆర్దీలు, కార్యదర్శులు, సర్పంచ్‌లు సమష్టిగా పని చేయాలన్నారు. డీపీఓ శివారెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీల్లో పన్ను వసూళ్లలో చాలా వెనుకబడ్డామన్నారు. వసూళ్లు వేగవంతం చేసి, గడువులోపు పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, ఏఓ ఖాదర్‌బాషా, సూపరింటెండెంట్లు నాగరాజు, సోమశేఖర్‌, ఈఓఆర్డీలు, మేజర్‌ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-25T05:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising