ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో పందికొక్కుల బ్యాచ!

ABN, First Publish Date - 2021-10-17T05:29:06+05:30

‘అభివృద్ధిలో ఎంత ముందుకెళ్దామన్న పందికొక్కుల బ్యాచ నాశనం చేయాలని చూస్తోందని..

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శంకర్‌ నారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - సొంత పార్టీ నేతలపై మంత్రి శంకర్‌నారాయణ ఘాటు వ్యాఖ్యలు

సోమందేపల్లి(పెనుకొండ టౌన), అక్టోబరు 16: ‘అభివృద్ధిలో ఎంత ముందుకెళ్దామన్న పందికొక్కుల బ్యాచ నాశనం చేయాలని చూస్తోందని.. అదీ మా పార్టీలోనే ఉండటం బాధాకరం’ అంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని గోరంట్ల, పెనుకొండ, సోమందేపల్లిలో కొందరు తమతోనే ఉంటూ పార్టీని డ్యామేజ్‌ చేయాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. శనివారం సోమందేపల్లిలో వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎంపీ మాధవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సొంత పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న పలువురిని ఉద్ధేశించి మాట్లాడారు. గోరంట్లలో ఓ నాయకుడు ముస్లింల భూమిపై కన్నేశాడని, అతడికి సహకరించలేదని పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నాడన్నారు. అదేవిధంగా సోమందేపల్లి, పెనుకొండ మండలాల్లో కూడా పందికొక్కుల్లాంటి వారు ఉన్నారన్నారు. వారికి ఎంత చేసినా పార్టీని డ్యామ్‌ చేయాలనే చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా పైశాచిక ఆనందం వీడి వైసీపీ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. ఇదిలా ఉండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల సభా వేదికపై ఉండాల్సిన జాబితాలో పేరు లేకపోవడంతో సర్పంచ గంగాదేవి కిందనే ఉండాల్సి వచ్చింది. గమనించిన మంత్రి శంకర్‌ నారాయణ సర్పంచను వేదికపైకి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగమ్మ, నరసింహమూర్తి, ఎంపీడీఓ నాగరాజరావు, జడ్పీటీసీ సభ్యుడు డీసీ అశోక్‌, వైసీపీ నాయకులు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-17T05:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising