1.40 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు
ABN, First Publish Date - 2021-04-17T06:03:05+05:30
జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరకు 1.40 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కాయలు కొనుగోలు చేసినట్లు ఇన్చార్జి జేడీఏ రామకృష్ణ శుక్రవారం పేర్కొన్నారు.
అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్ 16: జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరకు 1.40 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కాయలు కొనుగోలు చేసినట్లు ఇన్చార్జి జేడీఏ రామకృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. రబీ సీజన్లో పండించిన వేరుశనగ పంటలో 3 లక్షల క్వింటాళ్లను కొ నుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈనెల 25వ తేదీలోగా దానిని అధిగమించాలని ఉన్నతాధికారులు ఆదేశించారన్నారు. అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారుల సమన్వయంతో ఏపీసీడ్స్, ఎన్ఎస్సీ ప్రతినిధులు వేరుశనగ సేకరణను మరింత వేగవంతం చేయాలన్నారు.
Updated Date - 2021-04-17T06:03:05+05:30 IST