ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకగ్రీవ పంచాయతీలకు పెరిగిన నజరానా

ABN, First Publish Date - 2021-01-27T07:02:12+05:30

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు రాష్ట్ర ప్రభు త్వం భారీ నజరానా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం రైల్వే, జనవరి26: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు రాష్ట్ర ప్రభు త్వం భారీ నజరానా ప్రకటించింది. ఈ మే రకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఎన్నికల వరకు 15వేల జనాభాకంటే తక్కువ ఉన్న పంచాయతీలకు రూ.7 లక్షలు, ఆ పైన ఉంటే రూ.20 లక్షలు నజరానా అందించేవారు. ప్రస్తుతం రెండు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షలు, 2వేల నుంచి 5వేలలోపు ఉంటే రూ.10 లక్షలు, 5వేల నుంచి 10వేలలోపు ఉంటే రూ.15 లక్షలు, ఆ పైన ఉంటే రూ.20 లక్షలు నజరానా అందించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకూ ఏకగ్రీవమైతే నజరానా వర్తించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 1003 పంచాయతీలకుగాను 63 చోట్ల ఏ కగ్రీవమై, నజరానా దక్కించుకున్నాయి. ప్రస్తుతం పంచాయతీల సంఖ్య 1044కు పెరిగింది. ఈ నేపథ్యంలో ఏ మేరకు ఏకగ్రీవాలవుతాయోనన్న చర్చ సాగుతోంది.

Updated Date - 2021-01-27T07:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising